టెన్షన్.. టెన్షన్! పాక్ సంచలన ప్రకటన! వచ్చే 24-36 గంటల్లో ఏ క్షణమైనా..!
Wed Apr 30, 2025 09:20 Others.202504304420.jpg)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇండియా ఎప్పుడు ప్రతీకార దాడులకు చేసే అవకాశమున్న నేపథ్యంలో.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 36 గంటల్లో..
ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమానుషంగా ఉగ్రవాదులు కాల్చి చంపిన నాటి నుంచి భారత్, దాయాది దేశం పాక్ మధ్య చిచ్చు మొదలైంది. ఈ కుట్రకు పాకిస్థాన్ అండదండలు ఉన్నాయనేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయని నిఘా వర్గాలు బయటపెట్టాయి. దీంతో ఇండియా ఎప్పుడు ప్రతీకార చర్యలకు దిగుతుందనే అనే భయం దాయాది దేశంలో మొదలైంది. అయినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మాత్రం మానుకోవడం లేదు. తాజాగా, పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ న్యూఢిల్లీకి హెచ్చరికలు చేశారు.
ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం..! భార్య, కుమారుడిని చంపి టెక్కీ ఆత్మహత్య!
మాకు సంబంధం లేదు: పాక్ మంత్రి
పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ మాట్లాడుతూ, భారత్ రాబోయే 24 నుంచి 36 గంటల్లో సైనిక దాడికి ప్రణాళికలు రచిస్తోందని తమ నిఘా వర్గాలు హెచ్చరించాయని పేర్కొన్నాడు. అలాగే పహల్గాం ఘటనలో పాక్ ప్రమేయం ఉందని న్యూఢిల్లీ కల్పిత, నిరాధార ఆరోపణలు చేస్తోందని.. సైనిక దురాక్రమణ చర్యలకు పాల్పడేందుకే ఈ వాదనలు చేస్తోందని ఆరోపించారు. పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని.. భారత్ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామని నొక్కి చెప్పారు. ఇస్లామాబాద్ తటస్థ నిపుణుల కమిషన్ ద్వారా విశ్వసనీయమైన, పారదర్శక దర్యాప్తుకు సహకరిస్తున్నప్పటికీ భారతదేశం ఘర్షణ మార్గం ఎంచుకుంటోందని అన్నారు. రక్షణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశమైన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
6 లైన్లుగా రహదారి, డీపీఆర్పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..
మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!
రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!
రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!
వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #BreakingNews #PakistanAlert #IndiaPakistanTension #HighAlert #NationalSecurity #24HourAlert
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.